అమరావతి, 9 జూన్ (హి.స.)
: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సేవారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. స్వర్ణాంధ్ర కార్యాలయాలను సచివాలయం నుంచి ఆయన వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. సేవారంగం నుంచి మనకు 6.3 శాతం ఆదాయమే వస్తోందని, దానిని విస్తరిస్తే ఆదాయం పెరుగుతుందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ