విశాఖపట్నం, 9 జూన్ (హి.స.)
: విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టు కోసం నిర్దేశించిన ప్రాంతాలను మెట్రో రైల్ అధికారులు, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. కొమ్మాది నుంచి కూర్మన్నపాలెం వరకు ఉన్న అన్ని మెట్రో స్టేషన్ల కోసం నిర్దేశిత ప్రాంతాలను పరిశీలించినట్లు చెప్పారు. 46.23 కి.మీ మెట్రో రైలు ప్రాజెక్టులో మొత్తం 43 స్టేషన్లు ఉంటాయని చెప్పారు. మొదటి దశకు సుమారు రూ. 11వేల కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ