తెలంగాణ, ఖమ్మం. 9 జూన్ (హి.స.)
పేదలకు అండగా తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం మంత్రి, ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం రూరల్ మండలాల్లో పర్యటించి పలు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లిలో 94 లక్షల అంచనా వ్యయంతో ఖమ్మం- సూర్యాపేట ఆర్ అండ్ బి రోడ్డు నుండి ఆటో నగర్- పొన్నేకల్లు డొంక వరకు నిర్మించనున్న బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, రెండు పడకల గృహం అప్పగింత ధృవ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు