గ్రామాలను అభివృద్ధి మార్గంలో తీర్చిదిద్దడమే తమ ముఖ్య లక్ష్యo.. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
తెలంగాణ, సంగారెడ్డి. 9 జూన్ (హి.స.) గ్రామాలను అభివృద్ధి మార్గంలో తీర్చిదిద్దడమే తమ ముఖ్య లక్ష్యమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం గుమ్మడిదల మండల పరిధిలో రూ.12.50 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేయగ
పటాన్చెరు ఎమ్మెల్యే


తెలంగాణ, సంగారెడ్డి. 9 జూన్ (హి.స.)

గ్రామాలను అభివృద్ధి మార్గంలో

తీర్చిదిద్దడమే తమ ముఖ్య లక్ష్యమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం గుమ్మడిదల మండల పరిధిలో రూ.12.50 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేయగా, కొన్ని పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వంతో చర్చించి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తారని తెలిపారు.

ప్రజలందరూ అభివృద్ధిలో భాగస్వాములు అయినప్పుడే సత్ఫలితాలు వస్తాయని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న నూతన సంక్షేమ పథకాలను సైతం పూర్తి పారదర్శకతతో రాజకీయాలకు అతీతంగా అర్హులకు అందిస్తున్నామని తెలిపారు. రహదారుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలూ లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులకు సూచించారు. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలి అని ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande