హైదరాబాద్, 9 జూన్ (హి.స.)
ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని
ఎంఎం కుంట గ్రామ శివారు ప్రాంతంలోని సర్వే నెంబర్ 541 లోని మర్రి యాదిరెడ్డి భూమికి సమీపంలోని బహిరంగ ప్రదేశంలో కొంతమంది వ్యక్తులు కోడిపందాలు ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొని 19 మంది నిందితులను పట్టుకున్నట్లు ఆదిభట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ రెడ్డి తెలిపారు.
అదేవిధంగా వారి వద్ద నుండి 19 సెల్ ఫోన్లు 12 కత్తులు, ఐదు కోళ్లతో పాటు 19,540 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారని పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులను ఆదిభట్ల పీఎస్ కు తరలించి కేసునమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..