తెలంగాణ, నిజామాబాద్. 9 జూన్ (హి.స.)
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయ ఆలయాలపై, వాటి నిర్వహణ, అభివృద్ధి పై ఎలాంటి శ్రద్ద తీసుకోవడం లేదని, ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ ఆలయంలో రోజుకొక్క కోడె మరణిస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. వేములవాడ రాజన్న ఆలయంలో కోడెల మరణాలపై స్పందించి చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలోని రామాలయాన్ని సోమవారం సందర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు. వేములవాడలో రోజుకొక రాజన్న కోడె మరణిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఆలయాలపై ఏ మాత్రం శ్రద్ధ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
రాజన్న కోడెల మరణాలను ఆపడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు