ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. పంచాయతీ కార్యదర్శి మృతి
ఖమ్మం, 9 జూన్ (హి.స) ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెనుబల్లి మండలం వీ.ఎం.బంజర్ లో జాతీయ రహదారి పై సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదం లో స్కూటీ ని లారీ ఢీ కొట్టిన సంఘటనలో స్కూటి పై ప్రయాణిస్తున్న బాణోత్ సోనాలి(33) అనే మహిళ అ
రోడ్డు ప్రమాదం


ఖమ్మం, 9 జూన్ (హి.స)

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెనుబల్లి మండలం వీ.ఎం.బంజర్ లో జాతీయ రహదారి పై సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదం లో స్కూటీ ని లారీ ఢీ కొట్టిన సంఘటనలో స్కూటి పై ప్రయాణిస్తున్న బాణోత్ సోనాలి(33) అనే మహిళ అక్కడికక్కేడే మృతి చెందింది. మృతురాలి పై నుండి లారీ వెళ్ళటంతో శరీర భాగాలు నుజ్జు నుజ్జు అయ్యాయి.. మృతురాలు పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజర్ గ్రామంలో పంచాయితీ కార్యదర్శిగా పని చేస్తుంది.. కల్లూరు మండలం నుండి విధులకు హాజర్ అవ్వటానికి స్కూటీ పై పెనుబల్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్టు సమాచారం..

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande