అమరావతి, 9 జూన్ (హి.స.), అమరావతి: పర్యాటకులు అధికంగా సందర్శించే ప్రాంతాల్లో వసతుల కల్పనకు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ప్రాధాన్యమిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో విజయవంతమైన ఉత్తమ విధానాల అమలుకు ఉపక్రమించింది. ఆ క్రమంలో అరకు, గండికోట, సూర్యలంకలో ప్రయోగాత్మకంగా మూడు టెంట్ సిటీలను అభివృద్ధి చేయనుంది. అరకులో ఏపీటీడీసీ ఆధ్వర్యంలో, మిగిలిన రెండుచోట్లా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో వీటి ఏర్పాటుకు టెండర్లు పిలవనున్నారు. తద్వారా 150 గదులు పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం రూ.50 కోట్లకుపైగా ఖర్చు చేయనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ