5 వేల మందిని తొలగిస్తున్నాం.. లేఆఫ్స్ ప్రకటించిన ఇంటెల్
హైదరాబాద్, 17 జూలై (హి.స.) ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగాల కోత కొనసాగుతున్నది. ఆర్థిక అస్థిరతతో గ్లోబల్ మార్కెట్లలో ఒత్తిడి, లాభాల క్షీణత, ఏఐ వినియోగం పెరగడం.. వెరసి కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఉద్
ఇంటెల్


హైదరాబాద్, 17 జూలై (హి.స.) ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగాల కోత కొనసాగుతున్నది. ఆర్థిక అస్థిరతతో గ్లోబల్ మార్కెట్లలో ఒత్తిడి, లాభాల క్షీణత, ఏఐ వినియోగం పెరగడం.. వెరసి కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా చిప్ తయారీ సంస్థ ఇంటెల్ (Intel) తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఈ వారంలో 5 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

కాగా, ఇంటెల్ 4 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించనున్నట్లు ఇటీవలే అంచనాలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ వారంలోనే తొలగింపులు ఉంటాయని స్పష్టం చేసింది. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా లే ఆఫ్లు అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఒరెగాన్, కాలిఫోర్నియాలో ఎక్కువగా తొలగింపులు ఉంటాయని పేర్కొంది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande