అమరావతి, 2 జూలై (హి.స.)
:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడురెండు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలోపర్యటించనున్నారు. బుధ, గురువారాలు కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ మధ్యాహ్నం 12:30 గంటలకు శాంతిపురం మండలం తుంసి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12:50 గంటలకు తుంసిలోని ఏపీ మోడల్ స్కూల్ ప్రాంగణానికి చేరుకుని బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ