తిరుమల, 22 సెప్టెంబర్ (హి.స.)అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ భారీగా తగ్గింది.
శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు మోస్తరుగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి (Special Darshan) టోకెన్ తీసుకున్న వారికి కేవలం ఒక గంటలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం అవుతోంది.
ఇక సోమవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (Vaikuntam Que Complex)లోని ఒక కంపార్ట్మెంట్లో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఆదివారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని 67,408 మంది భక్తులు దర్శించుకున్నారు. అదేవిధంగా 16,597 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మొక్కలు తీర్చుకున్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.3.73 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు (TTD Offcials) వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి