ఏ రాజకీయ పార్టీ కార్యక్రమాల్లోనూ ఇంతమంది ప్రాణాలు కోల్పోలేదు : సీఎం స్టాలిన్
కరూర్, 28 సెప్టెంబర్ (హి.స.)తమిళనాడు కరూర్​లో విజయ్​ ర్యాలీలో జరిగిన ఘోర ప్రమాదంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్​ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీలు నిర్వహించిన కార్యక్రమంలో ఎన్నడూ ఇంత పెద్ద సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోలేదని ఆవేదన వ్యక్తం చే
మ


కరూర్, 28 సెప్టెంబర్ (హి.స.)తమిళనాడు కరూర్​లో విజయ్​ ర్యాలీలో జరిగిన ఘోర ప్రమాదంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్​ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీలు నిర్వహించిన కార్యక్రమంలో ఎన్నడూ ఇంత పెద్ద సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి ఆసుపత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు.

విజయ్​ను అరెస్టు చేస్తారా!

ఇదిలా ఉండగా మృతుల సంఖ్య 39కి చేరిందని తమిళనాడు సీఎం స్టాలిన్​ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి విషాదం ఎన్నడూ జరగకూడదని అన్నారు. ప్రస్తుతం 51 మంది ఇంటెన్సివ్​ కేర్​ యూనిట్​లో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి టీవీకే నాయకుడు విజయ్​ను అరెస్టు చేస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సీఎం సమాధానమిచ్చారు. విచారణ కమిషన్ ఏర్పాటు చేశామని, వారి నివేదిక ప్రకారం వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande