ముంబై, 4 సెప్టెంబర్ (హి.స.)బంగారం ధర చరిత్రలో ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి చేరింది. దేశీయ మార్కెట్లో పసిడి రేట్లు ఆల్ టైమ్ రికార్డును నమోదు చేశాయి. ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ. 1,06,980కి చేరింది.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ, ఆర్థిక అనిశ్చితుల కారణంగా పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల బంగారానికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. దీనికి తోడు, అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ బలహీనపడటం కూడా పసిడి ధరల పెరుగుదలకు మరింత ఆజ్యం పోస్తోంది. ఈ రెండు ప్రధాన కారణాలతో బంగారం ధరలు చుక్కలను తాకుతున్నాయి.
ప్రధాన నగరాల్లో ధరల విషయానికొస్తే, హైదరాబాద్ మరియు విజయవాడలలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,06,980గా ఉండగా, 22
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి