రాజన్న సిరిసిల్ల, 7 సెప్టెంబర్ (హి.స.)
రోగులకు మెరుగైన వైద్య సేవలు
అందించాలని వైద్యులను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో ఆదివారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ, ఐసీయూ, మెటర్నిటీ, ఆర్థోపెడిక్, మేల్ వార్డుల్లో అందిస్తున్న సేవలను పరిశీలించారు. అనంతరం పలువురు రోగులతో మాట్లాడారు. సీజనల్ వ్యాధులు పొంచి ఉన్న నేపథ్యంలో అలర్ట్ గా ఉండాలని కలెక్టర్ సూచించారు. తంగళ్ళపల్లి మండలం గండిలచ్చపేట గ్రామంలో ఫీవర్ సర్వే చేయాలని జిల్లా వైద్యాధికారి రజితను కలెక్టర్ ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు