రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు
హైదరాబాద్, 7 సెప్టెంబర్ (హి.స.)తాజా తెలంగాణ లేటెస్ట్ వెదర్ అప్ డేట్ వచ్చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌ ప్రభావం క్రమంగా పెరుగుతుండడంతో.. రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్ర
Rains


హైదరాబాద్, 7 సెప్టెంబర్ (హి.స.)తాజా

తెలంగాణ లేటెస్ట్ వెదర్ అప్ డేట్ వచ్చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌ ప్రభావం క్రమంగా పెరుగుతుండడంతో.. రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం తుఫాన్‌ బలహీనంగా ఉన్నప్పటికీ.. సోమవారం నుంచి దాని ప్రభావం పెరుగుతుందని.. మంగళ, బుధ వారాల్లో.. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, బలమైన గాలులు ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది.

హైదరాబాద్‌తో పాటు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్ధిపేట, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో గాలివానలు, ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాత్రివేళ బయటకు వెళ్లే వారు, రైతులు, వ్యవసాయ కార్మికులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సెప్టెంబర్ 8, 9 తేదీలలో వర్షాల తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో తక్కువ ఎత్తున్న ప్రాంతాల్లో నీరు నిలిచిపోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో వాగులు, చెరువులు పొంగిపొర్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande