
వరంగల్, 10 జనవరి (హి.స.)
చిన్న పిల్లల కిడ్నాప్నకు పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో నిందితులను వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.
పెద్దపల్లి జిల్లా కు చెందిన కొడపాక నరేష్, వేల్పుల యాదగిరి డిసెంబర్ 28న కాజీపేట రైల్వేస్టేషన్ బయట నిద్రిస్తున్న కన్నా నాయక్ (5నెలల) బాలుడిని, డిసెంబర్ 28న జన్నారం మండలం లింగయ్యపల్లిలో ఐదు నెలల బాబును, గత ఏడాది ఆగస్టులో వరంగల్ రైల్వే స్టేషన్లో తల్లిదండ్రులతో నిద్రిస్తున్న 10 నెలల పాపను, 2023 అక్టోబర్ లో కాజీపేట ప్లాట్ఫాం మీద నిద్రిస్తున్న 3 సంవత్సరాల బాబును, 2025 అక్టోబర్లో మంచిర్యాల ,2025 జూన్లో రామగుండం రైల్వే స్టేషన్ లో తల్లిదండ్రులతో నిద్రిస్తున్న 10 నెలల పాపను కిడ్నాప్ చేసి వేర్వేరు ప్రాంతాల్లో అమ్మేశారన్నారు.
విచారణ చేపట్టి ఐదుగురు పిల్లలను రెస్క్యూ చేయడం జరిగిందని సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. పేరెంట్స్ బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల వద్ద పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి అని సీపీ సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు