
ఢిల్లీ.,03జనవరి (హి.స.) దేశ రాజధాని ఢిల్లీలో కాల్పుల కలకలం రేగింది. ఢిల్లీలోని రోహిణి సెక్టార్–24 ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపి భయాందోళన సృష్టించారు. బైక్లపై వచ్చిన దుండగులు ఒక పార్కింగ్ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తుడి కారుని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మొత్తం 12 రౌండ్ల కాల్పులు జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అదృష్టవశాత్తు ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినా, పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు అని పోలీసులు తెలిపారు. కాల్పుల శబ్దాలతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరిస్థితిని పరిశీలించారు.
అయితే, బాధిత వ్యాపారస్తుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కీలక విషయాలు తెలియజేశాడు. ఇటీవల తనకు ఇంటర్నేషనల్ నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని, అందులో రూ. 3 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలిపాడు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ