
అమరావతి, 26 ఫిబ్రవరి (హి.స.)
శ్రీకాళహస్తి, ): ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రత్యేకంగా శ్రీకాళహస్తి కళాకారులతో కలంకారీ ఫొటో గ్యాలరీని ఏర్పాటు చేస్తున్నారు. శ్రీకాళహస్తి నుంచి పేరొందిన 21 మంది కళాకారులు రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. కళాకారులు గీసిన కలంకారీ చిత్రాలు తుదిదశకు చేరుకున్నాయి. ఈ చిత్రాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం పరిశీలించారు. జాతీయ అవార్డు గ్రహీత విశ్వనాథరెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ