
అమరావతి, 04 మార్చి (హి.స.) వైకాపాకు రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు శాసనమండలి ఛైర్మన్ మోషేనురాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో ఉన్నారు. ఐదుగురు సభ్యులు రాజీనామా చేసినా ఇంతవరకూ మండలి ఛైర్మన్ ఆమోదించలేదు. ఛైర్మన్ తీరుకు నిరసనగా ఆయనపై అవిశ్వాసం పెట్టాలని ఆ ఎమ్మెల్సీలు భావిస్తున్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సరిపడా సంఖ్యాబలం ఉండటంతో ఈ నిర్ణయం దిశగా ఆలోచిస్తున్నారు. వైకాపా నుంచి ఎమ్మెల్సీలుగా గెలిచిన పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ తదితరులు అవిశ్వాసం పెట్టే యోచనలో ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ