
అమరావతి, 05 మార్చి (హి.స.): గ్రామాల్లో ఇంటి పన్ను బకాయిలను సకాలంలో చెల్లించకపనచ్చకపోతే చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో శివరామకృష్ణ అన్నారు. పి.చామవరం, పారుపాక, ఎం.చామవరం, కోడూరు గ్రామాల్లో ఇంటి పన్ను వసూళ్ల ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని డిప్యూటీ ఎంపీడీవో ప్రసాద్తో కలిసి ఆయన పరిశీలించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 58% వసూళ్లు పూర్తయినట్లు చెప్పారు. మార్చి 15వ తేదీ నాటికి 100% వసూళ్లు లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ