
అమరావతి, 05 మార్చి (హి.స.)
ఒంటిమిట్ట: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో శ్రీరామ నవమి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా వచ్చే నెల 2వ తేదీన రథోత్సవం జరగనుంది. గురువారం రామయ్య రథానికి మరమ్మతులు చేయాలని రైతు మండపం నుంచి బయటికి తీశారు. చక్రాలను బాగు చేయనున్నారు. కొత్తగా రంగులు వేయనున్నారు. ఈ పనులు చేపట్టడానికి తితిదే అధికారులు రూ.9.50 లక్షల నిధులు కేటాయించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ