రాజ్యసభకు వెళ్లాలనేది నా కోరిక.. సీఎం నితీష్ కుమార్ సంచలన ప్రకటన
హైదరాబాద్, 05 మార్చి (హి.స.) బిహార్ సీఎం నితీష్ కుమార్ (Bihar CM Nitish Kumar) సంచలన ప్రకటన చేశారు. తాను పార్లమెంట్ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన తన ట్వీట్లో గడిచిన రెండు దశాబ్దాలకు పైగా బిహార్
Cm nitish


హైదరాబాద్, 05 మార్చి (హి.స.)

బిహార్ సీఎం నితీష్ కుమార్ (Bihar CM Nitish Kumar) సంచలన ప్రకటన చేశారు. తాను పార్లమెంట్ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన తన ట్వీట్లో గడిచిన రెండు దశాబ్దాలకు పైగా బిహార్ ప్రజలు తనపై చూపిన నమ్మకం, మద్దతుకు కృతజ్ఞతలు. ప్రజల మద్దతుతోనే బిహార్కు పూర్తి నిష్ఠతో సేవ చేయగలిగాను, ఆ బలంతోనే నేడు రాష్ట్రం అభివృద్ధి, గౌరవంలో కొత్త శిఖరాలను తాకుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని రాసుకొచ్చారు. అలాగే తన పార్లమెంటరీ జీవితం ప్రారంభం నుండి.. బిహార్ శాసనమండలిలోని రెండు సభలతో (Assembly, Council) ఆటో పార్లమెంటులోని రెండు సభలకు(Lok Sabha, Rajya Sabha) ప్రాతినిధ్యం వహించాలనే కోరిక తన మనసులో ఉందని నితీష్ కుమార్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఆ క్రమంలోనే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడిగా వెళ్లాలని తాను భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. తాను రాజ్యసభ (Rajya Sabha)కు వెళ్లినప్పటికీ బిహార్ ప్రజల (People of Bihar)తో తన సంబంధం భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగుతుందని ఆయన హామీ ఇచ్చారు. వికసిత బిహార్ నిర్మాణంలో తన సంకల్పం మారదని, రాష్ట్రంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి తన పూర్తి సహకారం, మార్గదర్శకత్వం ఎప్పుడూ ఉంటాయని నితీష్ కుమార్ తన ట్వీట్లో పేర్కొన్నారు. దీంతో గత రెండు రోజుల నుంచి నితీష్ కుమార్ (Nitish Kumar Rajya Sabha) రాజ్యసభకు వెళ్తున్నారనే వార్తలు ఆసక్తికరంగా మారాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande