
విజయవాడ,, 06 మార్చి (హి.స.) :మద్యం కుంభకోణంలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి, ఆయన తోడల్లుడు ముప్పిడి అవినాష్ రెడ్డి తమకు జైలులో సదుపాయాలు కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై ఏసీబీ కోర్టు 11న తీర్పు వెలువరిస్తుంది. విజయవాడ జిల్లా జైలులో కసిరెడ్డి, గుంటూరు జిల్లా జైలులో అవినా్షరెడ్డి ఉన్నారు. తమకు జైలులో సదుపాయాలు కల్పించాలని వేసిన పిటిషన్లపై వాదనలు గురువారం ముగియడంతో న్యాయాధికారి తీర్పును 11కి రిజర్వ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ