
శ్రీ సత్యసాయి జిల్లా, 21 మే (హి.స.) శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ‘విజిబుల్ పోలీసింగ్’ కార్యక్రమాన్ని పోలీసులు విస్తృతంగా కొనసాగిస్తున్నారు. అర్ధరాత్రి వేళల్లో గ్రామాలను సందర్శించి బాల బాలికల భద్రత ,నేరాల నియంత్రణ సైబర్ మోసాలు వంటి వాటిపై పోలీసు అధికారులు సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా నేరాల నియంత్రణతో పాటు అనుమానాస్పద వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. రాత్రి నుండి తెల్లవారు జాము వరకు జిల్లావ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్ చేపట్టారు.
అనుమానితుల వేలిముద్రలను సేకరించారు. డ్రంక్ & డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఏటీఎం కేంద్రాల వద్ద , ప్రముఖ దేవాలయ ప్రాంతాలలో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. రహదారి ప్రమాదాల నివారణకు “స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమం నిర్వహించారు. అర్ధరాత్రివేళలో అనవసరంగా రోడ్లపై తిరిగి యువకులను గుర్తించి పోలీస్ అధికారులు కౌన్సిలింగ్ చేపట్టారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు డయల్ 112 కు లేదా డయల్ 100కు గాని సమాచారం ఇవ్వాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV