
కన్నూర్, 16 జూన్ (హి.స.)కేరళలోని కన్నూర్ అంతర్జాతీయ
విమానాశ్రయం నుండి సౌదీ అరేబియాలోని జెడ్డాకు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్
విమానం సాంకేతిక లోపం కారణంగా వెనుదిరిగింది.విమానం టేకాఫ్ అయిన రెండు గంటల
వ్యవధిలోనే పైలట్లు ఈ లోపాన్ని గుర్తించి, తిరిగి కన్నూర్ ఎయిర్పోర్ట్కు
మళ్లించాలని నిర్ణయించారు. విమానంలో ఉన్న180 మందికి పైగా ప్రయాణికులుఎలాంటి ప్రమాదం లేకుండా
సురక్షితంగా ల్యాండ్ అయ్యారని విమానాశ్రయ వర్గాలు ధృవీకరించాయి.
ఈ విమానం మంగళవారం ఉదయం 7:40 గంటలకు కన్నూర్ నుండి జెడ్డాకు
బయలుదేరింది. అయితే ప్రయాణంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో, విమాన ఇంధన భారాన్ని
తగ్గించుకోవడానికి (Fuel Burning) ఆకాశంలో కాసేపు వలయాకారంలో వట్టమిట్టు ప్రయాణించి, ఆపై సురక్షితంగా రన్వేపై
ల్యాండ్ అయింది. ఈ సాంకేతిక సమస్యకు గల ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి ఎయిర్
ఇండియా ఇంజనీరింగ్ బృందం విమానాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. ప్రయాణికులకు
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంపై ఎయిర్లైన్స్ యాజమాన్యం దృష్టి సారించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi