
ఎర్నాకులం, 16 జూన్ (హి.స.)కేరళలోని ఎర్నాకులం జిల్లా
పరియాతుకవులో దాదాపు ఐదు దశాబ్దాలుగా నలుగుతున్న భూవివాదానికి తెరపడుతూ ఇరుపక్షాలు
ఒక చారిత్రాత్మక రాజీ ఒప్పందంపై సంతకాలు చేశాయి. కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి
రోజీ ఎమ్ జాన్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో భూ యజమానులు, స్థానిక దళిత కుటుంబాల
ప్రతినిధులు ఈ సయోధ్య ఫార్ములాకు అంగీకరించారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఇళ్లు
కోల్పోయే ప్రమాదంలో ఉన్నఏడు దళిత కుటుంబాల పునరావాసానికిఈ ఒప్పందం మార్గం సుగమం
చేసింది.కొత్త ఒప్పందం ప్రకారం, వివాదాస్పదమైన 2.69 ఎకరాల భూమిలోనే ఆ ఏడు
కుటుంబాలలో ప్రతి ఒక్కరికీఐదు సెంట్ల చొప్పున భూమినికేటాయించనున్నారు.
స్పాన్సర్షిప్
ద్వారా లభించే నిధులతో ప్రభుత్వం వీరికి ఒక సంవత్సరంలోగా 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో
కొత్త ఇళ్లను నిర్మించి ఇస్తుంది. అంతవరకు ఈ కుటుంబాలు ప్రస్తుతం తాము
నివసిస్తున్న ఇళ్లలోనే కొనసాగేందుకు అనుమతించారు. ఈ వివాదంపై జరిగిన ఆందోళనల
నేపథ్యంలో నమోదైన అన్ని క్రిమినల్ కేసులను ఉపసంహరించుకోవడానికి ప్రభుత్వం
చట్టపరమైన చర్యలు ప్రారంభించనుంది. మువాట్టుపుజ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (RDO), పెరుంబవూరు డిప్యూటీ
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DySP) ఈ ఒప్పందం అమలును పర్యవేక్షిస్తూ ప్రతి వారం జిల్లా
కలెక్టర్కు నివేదిక సమర్పిస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi