వైదిక కాలంలో మహిళలకు గౌరవం: మనుస్మృతి శ్లోకాన్ని ఉటంకించిన కొత్త ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకం
వైదిక కాలంలో మహిళలకు గౌరవం: మనుస్మృతి శ్లోకాన్ని ఉటంకించిన కొత్త ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకం
ncert


హైదరాబాద్, 26 జూన్ (హి.స.)

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) కొత్తగా ప్రవేశపెట్టిన 9వ తరగతి సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో మనుస్మృతిలోని ఒక శ్లోకాన్ని చేర్చింది. వైదిక కాలంలో మహిళలకు సమాజంలో ఉన్నతమైన, గౌరవప్రదమైన స్థానం ఉండేదని వివరించడానికి ఈ శ్లోకాన్ని ఉటంకించారు. స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో (గౌరవింపబడతారో) అక్కడ దేవతలు హర్షిస్తారు; వారు ఎక్కడ గౌరవం పొందరో అక్కడ చేసే అన్ని పవిత్ర కర్మలు నిష్ఫలమవుతాయి అనే మనుస్మృతిలోని (3.56) శ్లోకాన్ని ఇందులో ముద్రించారు. అయితే, కాలక్రమేణా మారుతున్న సామాజిక, రాజకీయ పరిస్థితుల వల్ల మహిళల హోదా స్థిరంగా ఉండలేదని, కొంత క్షీణించిందని కూడా ఈ పాఠ్యాంశం పేర్కొంది. అయినప్పటికీ గృహ నిర్వహణ, వ్యవసాయం, చేతివృత్తులు, మతపరమైన ఆచారాలలో మహిళల సహకారం కొనసాగిందని వివరించింది. గుప్తులు-వాకాటక కాలంలో విద్యావంతులైన మహిళలు ఉండేవారని, వాకాటక రాజ్యాన్ని పాలించిన రాణి ప్రభావతి గుప్త వంటి వారు పరిపాలనలో కీలక పాత్ర పోషించారని ఉదాహరణలుగా చూపారు. మరొకవైపు, తొలి వైదిక సమాజంలో వర్ణ, జాతి గుర్తింపులు కేవలం పుట్టుక ఆధారంగానే నిర్ణయించబడలేదని ఈ పుస్తకం స్పష్టం చేసింది. ఒకే కుటుంబంలో విభిన్న వృత్తులు చేసుకునే వారని చెప్పడానికి గల బుద్ధుని 'సుత్త నిపాత' సూక్తులను కూడా ఇందులో ఉదహరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande