పాఠ్యపుస్తకాల తప్పులపై మండిపడ్డ కాంగ్రెస్ నేత సంతోష్ సింగ్ సలూజా: ఒడిశా చరిత్రలోనే తొలిసారి పిల్లల దోపిడీ అంటూ ఆగ్రహం
పాఠ్యపుస్తకాల తప్పులపై మండిపడ్డ కాంగ్రెస్ నేత సంతోష్ సింగ్ సలూజా: ఒడిశా చరిత్రలోనే తొలిసారి పిల్లల దోపిడీ అంటూ ఆగ్రహం
odisa


ఢిల్లీ,, 26 జూన్ (హి.స.)ఒడిశా రాష్ట్రంలో 1 నుండి 8వ తరగతి పాఠ్యపుస్తకాల్లో దొర్లిన అనేక తప్పులపై ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ సంతోష్ సింగ్ సలూజా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒడిశా చరిత్రలో ఇలా పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటూ వారిని దోపిడీ చేయడం ఇదే మొదటిసారి అని ఆయన విమర్శించారు. పుస్తకాల్లో ఇన్ని తప్పులు ఉంటే, ఉపాధ్యాయులు వాటిని సరిచేసుకుంటూ బోధిస్తారని విద్యాశాఖ అధికారులు చెప్పడం ఎంతవరకు సాధ్యమని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతి 35 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలనే నిబంధన ఉన్నప్పటికీ, అసలు ఉపాధ్యాయులే లేని పరిస్థితి నెలకొందని ఆయన మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా విధానాల వల్ల ఒడిశా పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాఠ్యపుస్తకాల ముద్రణ కాంట్రాక్టును ఒక బీజేపీ అధికారిక ప్రతినిధి బిడ్డకు కట్టబెట్టారని ఆరోపిస్తూ, దీనిపై కేంద్రీయ దర్యాప్తు సంస్థ (CBI) చేత విచారణ జరిపించాలని సలూజా డిమాండ్ చేశారు.

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP 2020) ప్రకారం రూపొందించిన ఈ పుస్తకాల్లో ఒడిశా అసెంబ్లీకి బదులు కర్ణాటక అసెంబ్లీ ఫోటోను ముద్రించడం, ఒడిశాలోని నియాంగిరి కొండలు జార్ఖండ్లో ఉన్నట్లు చూపడం వంటి దాదాపు 1600కు పైగా బ్లండర్ తప్పులు దొర్లడం గమనార్హం.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande