
హైదరాబాద్, 26 జూన్ (హి.స.)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 57వ జన్మదినం సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశాన్ని విజ్ఞానం, అభ్యాసం, మరియు నవకల్పనలకు ప్రపంచ హబ్గా మార్చే లక్ష్యంతో ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం (NEP) అమలులో ప్రధాన్ చేస్తున్న ప్రశంసనీయమైన కృషిని పీఎం మోదీ ఈ సందర్భంగా కొనియాడారు. ధర్మేంద్ర ప్రధాన్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షిస్తూ ప్రధాని మోదీ తన అధికారిక సోషల్ మీడియా వేదిక 'X' (ట్విట్టర్) లో ఒక సందేశాన్ని పంచుకున్నారు. ఈ ప్రశంసలపై స్పందించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రధానమంత్రికి తన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన దార్శనిక నాయకత్వం దేశ సేవలో నిరంతరం శ్రమించేందుకు తమకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi