ఉత్తరాఖండ్లో ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకోనున్న తొలి బీజేపీ సీఎం పుష్కర్ సింగ్ ధామి
ఉత్తరాఖండ్లో ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకోనున్న తొలి బీజేపీ సీఎం పుష్కర్ సింగ్ ధామి
CM Dhami


ఢిల్లీ,, 30 జూన్ (హి.స.)ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రాబోయే జూలై 4వ తేదీ నాటికి ఒక అరుదైన రికార్డును సృష్టించనున్నారు. రాష్ట్ర చరిత్రలో ఐదేళ్ల నిరంతర పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న తొలి భారతీయ జనతా పార్టీ (BJP) ముఖ్యమంత్రిగా ఆయన సరికొత్త రికార్డు నెలకొల్పనున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దివంగత నారాయణ్ దత్ తివారీ మాత్రమే ఇప్పటివరకు పూర్తి ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా ఉన్నారు.పుష్కర్ సింగ్ ధామి మొదటిసారిగా జూలై 4, 2021న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 2022 శాసనసభ ఎన్నికలలో బీజేపీ ఘనవిజయం సాధించడంతో, పార్టీ అధిష్టానం మరోసారి ఆయనకే రాష్ట్ర బాధ్యతలను అప్పగించింది. దీంతో ఉత్తరాఖండ్లో వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన ఏకైక నాయకుడిగా నిలిచిన ధామి, ఇప్పుడు ఐదేళ్ల సుదీర్ఘ నిరంతర పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande