మోదీ ప్రభుత్వం కారణంగా దేశం ఆర్థిక సంక్షోభం వైపు పయనిస్తోంది: కాంగ్రెస్
మోదీ ప్రభుత్వం కారణంగా దేశం ఆర్థిక సంక్షోభం వైపు పయనిస్తోంది: కాంగ్రెస్
Jairam Ramesh writes to Defence Minister


హైదరాబాద్, 15 జూలై (హి.స.)

మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా దేశం క్రమంగా ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. జూన్ నెలలో టోకు ధరల ద్రవ్యోల్బణం 9.87 శాతానికి పెరగడంతో ఈ మేరకు విమర్శించింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ ఆర్థిక వైఫల్యానికి ఆయనే బాధ్యత వహించాలని పేర్కొంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్​ ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

గత 44 నెలల్లోనే టోకు ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయికి చేరిందని జైరాం రమేశ్​ తన పోస్ట్​లో పేర్కొన్నారు. ఇంధనం, విద్యుత్ ధరలు 27.4 శాతం పెరగడం వల్ల రవాణా, ఉత్పత్తి వ్యయాలు భారీగా పెరిగాయని తెలిపారు. మరోవైపు దేశంలో పంటల సాగు విస్తీర్ణం మూడేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిందని పేర్కొంటూ, వ్యవసాయ రంగం కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని అన్నారు.

ప్రజలు, రైతులపై రెట్టింపు భారం

పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జైరాం రమేశ్ అన్నారు. రైతులు కూడా ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రెట్టింపు కష్టాలను అనుభవిస్తున్నారని విమర్శించారు. వ్యవసాయ వ్యయాలు పెరగడంతో పాటు దిగుబడులపై కూడా ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం పెరగడం వల్ల పరిశ్రమల నిర్వహణ వ్యయం కూడా అధికమై, దాని ప్రభావం చివరకు వినియోగదారులపై పడుతోందని ఆయన తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande