ఆశ్రమంలో గంజాయి సాగు.. ములుగు జిల్లాలో సాధువు అరెస్ట్
ఆశ్రమంలో గంజాయి సాగు.. ములుగు జిల్లాలో సాధువు అరెస్ట్
Representative Image: Arrest


హైదరాాబాద్, జులై 18 (హి.స) ఆధ్యాత్మిక కేంద్రం ముసుగులో గంజాయి సాగు చేస్తున్న ఒక సాధువును తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ములుగు జిల్లా తాండూరు మండలంలోని ఒక ఆశ్రమంలో ఈ ఘటన వెలుగుచూసింది. కాశీకి చెందిన శ్రీరామ్ గిరి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు గోవిందరావుపేటలోని ఆశ్రమంపై మెరుపు దాడి చేశారు. ఆశ్రమ ప్రాంగణంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించగా, అక్రమంగా సాగు చేస్తున్న 36 గంజాయి మొక్కలు బయటపడ్డాయి. వాటిని వేర్లు సహా స్వాధీనం చేసుకున్న పోలీసులు, అక్కడే లభించిన కొంత ఎండిన గంజాయిని కూడా సీజ్ చేశారు. నమూనాలను తదుపరి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు.

నిందితుడైన శ్రీరామ్ గిరి తన సోదరితో కలిసి ఈ ఆశ్రమంలో నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పేరుతో స్థానికులను నమ్మిస్తూ, చాటుగా గంజాయి సాగు చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడిపై సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేసినట్లు అధికారులు వివరించారు. పవిత్రమైన ఆశ్రమంలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు సాగడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande