
న్యూఢిల్లీ: 20 జూలై (హి.స.)
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) పిలుపునిచ్చిన 'ఛలో సంసద్' మార్చ్ కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనుమతి లేని ఈ ర్యాలీని అడ్డుకునే క్రమంలో జంతర్మంతర్ వద్ద నిరసనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) బలగాలు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టాయి. నీట్ (NEET) పరీక్ష అవకతవకలపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో చేపట్టిన ఈ నిరసన కారణంగా న్యూఢిల్లీలో BNSS సెక్షన్ 163 విధించి, కీలక మెట్రో స్టేషన్లను మూసివేసి, ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi