
హైదరాబాద్, 03 ఆగస్టు (హి.స.)
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నాశిక్ బ్రాంచ్లో కలకలం రేపిన లైంగిక వేధింపులు మరియు బలవంతపు మత మార్పిడి కేసులో నాశిక్ కోర్టు ఈరోజు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో అరెస్టయిన ఐదుగురు ప్రధాన నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసుపై దర్యాప్తు సంస్థ ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేసిందని, విచారణ దాదాపు ముగింపు దశకు చేరుకుందని న్యాయస్థానం పేర్కొంది. నిందితులు బయటకు రావడం వల్ల సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం లేదా సాక్షులను బెదిరించే ప్రమాదం ప్రస్తుతం లేదని భావిస్తూ కోర్టు ఈ బెయిల్ ఆర్డర్ ఇచ్చింది ది హిందూ.
కార్పొరేట్ రంగంలో ఉద్యోగినుల భద్రత మరియు మతపరమైన స్వేచ్ఛకు సంబంధించిన అంశం కావడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల్లో పెద్ద చర్చకు దారితీసింది. బెయిల్ వచ్చినప్పటికీ, నిందితులు కోర్టు అనుమతి లేకుండా నగరం విడిచి వెళ్లకూడదని షరతులు విధించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi