రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటుపై కీలక ప్రకటన; వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటుపై కీలక ప్రకటన; వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు
Rbi


ముంబై: , 05 ఆగస్టు (హి.స.)

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మానిటరీ పాలసీ కమిటీ బుధవారం ఉదయం ముగిసిన కీలక సమావేశంలో సరికొత్త నిర్ణయాన్ని ప్రకటించింది దేశంలో ద్రవ్యోల్బణం, ప్రపంచ ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అనంతరం ప్రస్తుతానికి రెపో రేటును 5.25 శాతం వద్దే స్థిరంగా ఉంచాలని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. దీనివల్ల సామాన్యుల బ్యాంక్ ఈఎంఐలలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు ఉండబోవు.

గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి వల్ల ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, దేశీయంగా స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ స్పష్టం చేశారు . భవిష్యత్తులో ధరల స్థిరత్వం, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు బ్యాంక్ అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande