బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం స్పష్టమైన సందేశం ఇస్తుంది.......ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం స్పష్టమైన సందేశం ఇస్తుంది.......ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
PM modi


ఢిల్లీ , 12 సెప్టెంబర్ (హి.స.) భారత్ ఆతిథ్యం ఇస్తున్న ఈ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం స్పష్టమైన సందేశం ఇస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం శనివారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో భారత్ , రష్యా, చైనా, బ్రెజిల్ , ఈజిప్ట్ , ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్ , సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యూఏఈ సహా 21 దేశాలు పాల్గొంటున్నాయి.

బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన అతిథులకు ప్రధాని నరేంద్రమోదీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బ్రిక్స్ ఏర్పాటు చేసి రెండు దశాబ్దాలు పూర్తయ్యిందని ఆయన గుర్తుచేశారు. సభ్యదేశాల ప్రజలకు మనమంతా భరోసా కల్పించాలని మోదీ పేర్కొన్నారు. రాబోయే 20 సంవత్సరాల భవిష్యత్ కోసం ఒక కొత్త, ఉన్నతమైన అజెండాపై పనిచేయాలని ఈ వేదికపైనుంచి సభ్యదేశాలకు పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియను అందరూ తమతమ సొంత అంతర్గత కార్యనిర్వహణ వ్యవస్థలతో ప్రారంభించాలని అన్నారు. బ్రిక్స్ అధ్యక్ష పదవి ఏటా మారుతున్నప్పటికీ, అది సంస్థాగత పురోగతికి ఆటంకం కలిగించకూడదని మోదీ అన్నారు.

ఐరాస భద్రతా మండలి సంస్కరణలను ఇకపై వాయిదా వేయలేమని, దీనిపై చర్చలు ఒక నిర్దిష్ట కాలపరిమితికే పరిమితమై ఉండాలని అన్నారు. అదేవిధంగా, ఆర్థిక సంస్థలలో ఓటింగ్ అధికారం, నాయకత్వ స్థానాలు ప్రస్తుత ఆర్థిక వాస్తవాలకు అనుగుణంగా ఉండాలని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande