తెలంగాణ : హైదరాబాద్: అక్టోబర్ 2( హింస)
ఖమ్మం జిల్లా తిరుమలాయాపాలెం మండలంలో విద్యుత్ షాక్ తగిలి ఓ మహిళ మృతిచెందింది. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. గోపాలపురానికి చెందిన నోముల నాగలక్ష్మి(26) వ్యవసాయ కూలి పనిచేస్తూ జీవిస్తోంది. శుక్రవారం ఉదయం ఇంటివద్ద దుస్తులు ఉతికి ఇనుప దండేనికి ఆరేస్తుండగా విద్యుత్ ప్రసారం జరిగి అక్కడికక్కడే మృతి చెందింది.
పుట్ట సుమన్, హిందుస్థాన్ సమాచార.