రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ప్రభుత్వ ఉద్యోగి మృతి
తెలంగాణ ఆదిలాబాద్ ఏప్రిల్ 13 (హిం.స)ఆదిలాబాద్ జిల్లా మావల సమీపంలో జాతీయ రహదారిపై ఇటీవల జరిగిన రోడ్డు
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ప్రభుత్వ ఉద్యోగి మృతి


తెలంగాణ ఆదిలాబాద్ ఏప్రిల్ 13 (హిం.స)ఆదిలాబాద్ జిల్లా మావల సమీపంలో జాతీయ రహదారిపై ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ప్రభుత్వ ఉద్యోగి అక్షయ్ మృతి చెందారు. సంజయ్ నగర్ కాలనీకి చెందిన అక్షయ్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. ఈనెల9న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డా ఆయన్ని నిజామాబాద్ జిల్లాలో చికిత్స అందిస్తున్నారు. అయితే చికిత్స అందుతుండగానే శనివారం గుండెపోటు రావడంతో మృతి చెందారు

సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం


 rajesh pande