సూర్యాపేట ఏప్రిల్ 22 (హిం.స)
సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని ముకుందపురం గ్రామం వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.
ఆగివున్న లారీని వెనుక నుంచి వచ్చి కారు ఢీకొట్టింది . ఈ సంఘటనలో అక్కడిక్కడే ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
రంజిత్ కుమార్ హిందుస్థాన్ సమాచారం