సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి
సూర్యాపేట ఏప్రిల్ 22 (హిం.స) సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృ
సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి


సూర్యాపేట ఏప్రిల్ 22 (హిం.స)

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని ముకుందపురం గ్రామం వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.

ఆగివున్న లారీని వెనుక నుంచి వచ్చి కారు ఢీకొట్టింది . ఈ సంఘటనలో అక్కడిక్కడే ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

రంజిత్ కుమార్ హిందుస్థాన్ సమాచారం


 rajesh pande