దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాలతో
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. గత మూడు సెషన్లలో సూచీలు నష్టాలు మూటగట
దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాలతో


దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. గత మూడు సెషన్లలో సూచీలు నష్టాలు మూటగట్టుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆసియా మార్కెట్లన్నీ సానుకూలంగా ఉండడంతో దేశీయ సూచీల్లో సెంటిమెంటు పెరిగింది. ఈ లాభాలు ఎంత వరకు నిలుస్తాయన్నది వేచిచూడాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా మార్కెట్లు గురువారం మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఐరోపా సూచీలు నష్టాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లు నేడు సానుకూలంగా కదలాడుతున్నాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 265 పాయింట్లు లాభపడి 61,188 వద్ద.. నిఫ్టీ 76 పాయింట్ల లాభంతో 18,254 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.83 వద్ద ట్రేడవుతోంది.

హిందూస్తాన్ సమాచార్-/నాగరాజ్


 rajesh pande