పురుగుల మందు తాగి నిరుద్యోగి ఆత్మహత్య
తెలంగాణ : హైదరాబాద్: అక్టోబర్ 31 ( హింస) మంచిర్యాల జిల్లా, కోటపల్లి మండలం, బబ్బెరు చెలక గ్రామంలో
పురుగుల మందు తాగి నిరుద్యోగి ఆత్మహత్య


తెలంగాణ : హైదరాబాద్: అక్టోబర్ 31 ( హింస)

మంచిర్యాల జిల్లా, కోటపల్లి మండలం, బబ్బెరు చెలక గ్రామంలో అసంపల్లి మహేష్(25) అనే నిరుద్యోగి తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఇవ్వాలని కోరుతూ సీఎం కేసీఆర్కు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యోగం రావడం లేదన్న మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇప్పటికైనా ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఇవ్వాలని ముఖ్యమంత్రికి ఆ లేఖలో విజ్ఞప్తి చేశాడు.

పుట్ట సుమన్, హిందుస్థాన్ సమాచార.


 rajesh pande