కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం....ఒకరు మృతి
ఆంధ్ర ప్రదేశ్ :అమరవతి : నవంబర్ 2 ( హింస)కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం గుర్రాజుపాలెం అడ్డరోడ్డు వద
కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం....ఒకరు మృతి


ఆంధ్ర ప్రదేశ్ :అమరవతి : నవంబర్ 2 ( హింస)కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం గుర్రాజుపాలెం అడ్డరోడ్డు వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది.జరిగిన రోడ్ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. లారీ-బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా... మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు బండి రాజేష్(27) ఎర్రుపాలెం మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అలాగే గాయపడిన వ్యక్తి బండి రవి(45) అని.. వీరిద్దరు తండ్రీకొడుకులుగా తెలుస్తోంది. వీరిరువురూ బైక్పై వెళ్తుండగా టిప్పర్ సడన్గా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న బైక్... లారికి తగలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పుట్ట సుమన్, హిందుస్థాన్ సమాచార.


 rajesh pande