లాభాలతో ప్రారంభమై చివరివరకు లాభాలతోనే ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్
బిజినెస్, 14 అక్టోబర్ (హి.స.) దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఈ రోజు ఉదయం సూచీలు లాభాలతో ప్రారంభమై చివరి వరకు అలానే కొనసాగాయి. రియల్టీ, ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్ కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ముఖ్యంగా హెచ్ఎ
స్టాక్ మార్కెట్ బిజినెస్ న్యూస్


బిజినెస్, 14 అక్టోబర్ (హి.స.)

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఈ రోజు ఉదయం సూచీలు లాభాలతో ప్రారంభమై చివరి వరకు అలానే కొనసాగాయి. రియల్టీ, ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్ కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ముఖ్యంగా హెచ్ఎఎఫ్సీ, ఇన్ఫోసిస్ షేర్లు మార్కెట్లను ముందుకు నడిపించాయి. ఇంట్రాడేలో 82,072.17 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్(Sensex) చివరికి 591 పాయింట్ల లాభంతో 81,973 వద్ద స్థిరపడింది. (Nifty) 163.73 పాయింట్ల లాభంతో 25,127.95 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 77.03 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.06గా ఉంది.

లాభాలో ముగిసిన షేర్లు : టెక్ మహీంద్రా,

ఇన్ఫోసిస్, ఐటీసీ, ఎల్అండ్, విప్రో, ఎల్అండ్ టీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్

నష్టపోయిన షేర్లు : టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్,

ఓఎన్జసీ, మారుతీ సుజికీ, అల్ట్రా టెక్ సిమెంట్, నెస్లే ఇండియా

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande