పోలీస్ శాఖ పై ప్రజలలో విశ్వాసాన్ని పెంపొందించాలి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ..
భద్రాద్రి కొత్తగూడెం, 18 అక్టోబర్ (హి.స.) నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ అధికారులు, సిబ్బంది తగు చర్యలు తీసుకుంటూ పోలీస్ శాఖపై ప్రజల్లో విశ్వసనీయతను పెంచాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సూచించారు. టేకులపల్లి పోలీస్ స్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ


భద్రాద్రి కొత్తగూడెం, 18 అక్టోబర్ (హి.స.) నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ అధికారులు, సిబ్బంది తగు చర్యలు తీసుకుంటూ పోలీస్ శాఖపై ప్రజల్లో విశ్వసనీయతను పెంచాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సూచించారు. టేకులపల్లి పోలీస్ స్టేషన్ ను శుక్రవారం ఆయన సందర్శించారు. పోలీస్ స్టేషన్ సందర్శనకు విచ్చేసిన ఎస్పీ రోహిత్ రాజ్ కు ఇల్లందు డీఎస్పీ ఎన్. చంద్రభాను పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఎస్పీ రోహిత్ రాజ్ కు టేకులపల్లి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది గౌరవ వందనం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande