హిందూ దేవుళ్ళ గుళ్ళపై దాడుల విషయంలో ఎంపీ ఈటల రాజేందర్ గరం
హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.) హిందూ దేవుళ్ల గుళ్ళపై దాడులు జరుగుతున్నాయని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. నగరంలోని రక్షపురంలో భూలక్ష్మి అమ్మవారు, ఉప్పుగూడ దేవాలయం, మైలార్ దేవ్ పల్లి ఆలయం, ఎగ్జిబిషన్ లో అమ్మవారి ఆలయం ఇప్పుడు సికింద్రాబాద్ కుమ్మర
ఈటెల రాజేందర్


హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.)

హిందూ దేవుళ్ల గుళ్ళపై దాడులు జరుగుతున్నాయని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. నగరంలోని రక్షపురంలో భూలక్ష్మి అమ్మవారు, ఉప్పుగూడ దేవాలయం, మైలార్ దేవ్ పల్లి ఆలయం, ఎగ్జిబిషన్ లో అమ్మవారి ఆలయం ఇప్పుడు సికింద్రాబాద్ కుమ్మర గూడ అమ్మవారి దేవాలయం మీద దాడి జరిగిందని తెలిపారు. శుక్రవారం సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ అమ్మవారి దేవాలయాన్ని ఈటల రాజేందర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి గుండెల మీద తన్నడమంటే, మన విశ్వాసం మీద ధర్మం మీద దాడి చేయడమేనని అన్నారు. ఇవే కాదు సంగారెడ్డి జిల్లా ఆంజనేయ స్వామి దేవాలయం, వినాయక విగ్రహం మీద దాడి.. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి.. సీఎం రేవంత్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఈ అమ్మవారి మీద దాడి చేసిన వాడు.. హాస్పిటల్ బెడ్ మీద దర్జాగా పడుకొని చాటింగ్ చేస్తున్నాడని, ఇంకా అవమానకర పోస్టులు పెడుతున్నాడన్నారు. అల్లానే ఈ పని చేయించాడు అని చెప్పుకుంటున్నారని, వాడి దగ్గర సెల్ ఫోన్ ఎలా ఉంది? వాడు మనిషా ? ఉన్మాదా ? అని ప్రశ్నించారు. ఇక్కడ ఉన్న ప్రభుత్వం పట్టించుకోక పోతే కేంద్రం, మోడీ ప్రభుత్వం ఉక్కుపాదం పెడుతుందని స్పష్టంచేశారు. హిందూ మతం సర్వేజనా సుఖినోభవంతు అని కోరుకుంటుందన్నారు. మన హైదరాబాద్ ఏ ప్రాంతం, ఈ మతం వారు ఇక్కడికి వచ్చినా అక్కున చేర్చుకొని చుట్టం లెక్క చూసుకుంటున్నారని తెలిపారు. అమెరికా, లండన్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. ఇండియన్స్ అంటే గొప్ప మర్యాద ఉంటుందన్నారు. మనవారు ఎక్కడ ఉన్నా భారత సంప్రదాయాలు కొనసాగిస్తున్నారని, ఏ దేశంలో మహిళలు గౌరవించబడతారో దేశం చల్లగా ఉంటుంది అనడానికి సజీవ సాక్ష్యం భారత్.. అని ఉంటుంది అనడానికి సజీవ సాక్ష్యం భారత్.. అని తెలిపారు.

రే

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande