హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.)శుక్రవారం (అక్టోబర్ 18) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.800 పెరిగి.. రూ.72,400గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.870 పెరిగి.. రూ.78,980గా కొనసాగుతోంది. అంతర్జాతీయంగా మార్కెట్ ఒడిదుడుకులు, గోల్డ్ రిజర్వ్ల నిల్వ లాంటి అంశాలు గోల్డ్ రేట్స్పై ప్రభావం చూపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. దీపావళి, ధన్ తేరస్ ఉన్న నేపథ్యంలో పసిడి పరుగులు తీస్తుందే తప్ప.. తగ్గదని చెబుతున్నారు.
మరోవైపు వెండి కూడా పరుగులు పెడుతోంది. బులియన్ మార్కెట్లో కిలో వెండిపై నేడు రెండు వేలు పెరిగింది. శుక్రవారం కిలో వెండి రూ.99,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి లక్ష ఐదు వేలుగా ఉంది. బెంగళూరులో రూ.94,100గా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.72,400
విజయవాడ – రూ.72,400
ఢిల్లీ – రూ.72,550
చెన్నై – రూ.72,400
బెంగళూరు – రూ.72,400
ముంబై – రూ.72,400
కోల్కతా – రూ.72,400
కేరళ – రూ.72,400
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు