ఇజ్రాయిల్ కు భారీ షాక్.. ప్రధాని లక్ష్యంగా భారీ డ్రోన్ దాడి..
న్యూఢిల్లీ, 19 అక్టోబర్ (హి.స.) గాజాలో హమాస్, లెబనాన్లో హిజ్బుల్లాలపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ కు భారీ షాక్ తగిలింది. ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు లక్ష్యంగా శనివారం డ్రోన్ దాడి జరిగింది. సిజేరియా పట్టణంలోని నెతన్యాహు ప్రయివేట్ నివాసం సమీపంలో
ఇజ్రాయిల్ కి షాక్


న్యూఢిల్లీ, 19 అక్టోబర్ (హి.స.)

గాజాలో హమాస్, లెబనాన్లో

హిజ్బుల్లాలపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ కు భారీ షాక్ తగిలింది. ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు లక్ష్యంగా శనివారం డ్రోన్ దాడి జరిగింది. సిజేరియా పట్టణంలోని నెతన్యాహు ప్రయివేట్ నివాసం సమీపంలోనే డ్రోన్ పడినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. లెబనాన్ వైపు నుంచి ఈ దాడి జరిగిందని వెల్లడించింది. అయితే దాడి సమయంలో నెతన్యాహు, ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లో లేరని.. దీంతో ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని పేర్కొంది. నెతన్యాహు టార్గెట్ గానే ఈ అటాక్ జరిగిందని భావిస్తున్నట్టు తెలిపింది.

లెబనాన్ నుంచి దూసుకొచ్చిన మూడు డ్రోన్లు

లెబనాన్ భూభాగం నుంచి మూడు డ్రోన్లు ఇజ్రాయెల్ పైకి దూసుకొచ్చినట్టు ఐడీఎఫ్ తెలిపింది. వీటిలో ఒకటి సీజేరియా పట్టణంలోని ఓ భవనంపై పడింది. తర్వాత మరో రెండు డ్రోన్లను ఐడీఎఫ్ దళాలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవు ఉత్తరాన ఉన్న గ్లిలాట్ సైనిక స్థావరం వద్ద హెచ్చరిక సైరన్లు మోగాయి. ఈ ఘటనలపై విచారణ జరుపుతున్నట్టు ఇజ్రాయెల్ తెలిపింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్ని వేళ నెతన్యాహు లక్ష్యంగా దాడి జరగడంతో ఆందోళనలు నెలకొన్నాయి. హమాస్ చీఫ్ యహ్యా సిన్వార్ను ఇజ్రాయెల్ హతం చేసిన కొద్ది రోజుల్లోనే ఈ దాడి జరగడం గమనార్హం.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande