పచ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
న్యూఢిల్లీ, 22 అక్టోబర్ (హి.స.) పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ను హత్యతో ఈ దాడులు మరింత ఉద్రిక్తంగా మారాయి. హెజ్ బొల్లాకు చెందిన సీక్రెట్ బంకర్ (Secret Bunker)ను గుర్తించినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. ఈ మేరకు
పచ్చిమాసియాలో ఉద్రిక్తత


న్యూఢిల్లీ, 22 అక్టోబర్ (హి.స.)

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ను హత్యతో ఈ దాడులు మరింత ఉద్రిక్తంగా మారాయి. హెజ్ బొల్లాకు చెందిన సీక్రెట్ బంకర్ (Secret Bunker)ను గుర్తించినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) అధికార ప్రతినిధి డేనియల్ హగారీ ఒక వీడియో ప్రకటనను విడుదల చేశారు. హెజ్బల్లా ఆర్థిక మూలాలపై దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి జరిపిన దాడుల్లో బంకర్ను ధ్వంసం చేశాం. అందులో భారీగా నగదు, బంగారాన్ని గుర్తించాం. ఇజ్రాయెల్పై దాడికి ఆ డబ్బునే వాడుతున్నారు. అంతేకాకుండా, బీరుట్ సిటీలో మరో సీక్రెట్ బంకర్ ఉంది. అల్-సాహెల్ ఆసుపత్రి కింద ఉన్న ఆ బంకర్లో వందల మిలియన్ల కొద్దీ డాలర్లు, బంగారం గుట్టలు ఉన్నట్లు తెలిసింది. దానిపై మేం ఇంకా దాడి చేయలేదు అని హగారీ తెలిపారు. ఆ బంకర్లో 500 బిలియన్ డాలర్ల నగదు (భారత కరెన్సీలో దాదాపు రూ.4,200కోట్లకు పైమాటే), బంగారం గుట్టలు ఉన్నట్లు అంచనా వేస్తున్నామని హగారీ తెలిపారు. ఈ సందర్భంగా బంకర్ ఉన్న ప్రాంతం మ్యాప్ను కూడా చూపించారు. ఈ ప్రాంతంపై తాము దృష్టిపెట్టినట్లు తెలిపారు. అయితే, తమ యుద్ధం హెజ్ బొల్లాతో మాత్రమేనని, లెబనీస్ పౌరులతో కాదని మరోసారి స్పష్టం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande