ముత్యాలమ్మ దేవాలయాన్ని సందర్శించుకున్న రాజాసింగ్
హైదరాబాద్, 22 అక్టోబర్ (హి.స.) గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇవాళ సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయాన్ని సందర్శించారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహ ధ్వంసం రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. అయితే వారం రోజుల గృహ నిర్బం
రాజా సింగ్


హైదరాబాద్, 22 అక్టోబర్ (హి.స.)

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇవాళ సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయాన్ని సందర్శించారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహ ధ్వంసం రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. అయితే వారం రోజుల గృహ నిర్బంధం తర్వాత ఎట్టకేలకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ ఆలయానికి వెళ్లారు. పటిష్ట పోలీస్ బందోబస్త్ నడుమ రాజాసింగ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విగ్రహ ధ్వంసం గూర్చి అడిగి తెలుసుకున్నారు. అంతేగాక విగ్రహ పునః ప్రతిష్టాపన పనులపై ఆలయ నిర్వాహకులను ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడకుండానే రాజాసింగ్ వెనుదిరిగారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande