సొంత వైద్యం వికటించి మృతి చెందిన ట్రైనీ నర్సు
భూపాలపల్లి, 22 అక్టోబర్ (హి.స.) సొంతవైద్యం వికటించి యువతి మృతిచెందిన ఘటన భూపాలపల్లిలో జరిగింది. వివరాలు.. జిల్లాకేంద్రంలోని కార్మస్ కాలనీకి చెందిన అంజలి (20) స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రైనీ నర్సుగా విధులు నిర్వహిస్తోంది. కాగా అనారోగ్యానికి గురవడం
సొంత వైద్యం వికటించి మృతి చెందిన నర్సు


భూపాలపల్లి, 22 అక్టోబర్ (హి.స.)

సొంతవైద్యం వికటించి యువతి మృతిచెందిన ఘటన భూపాలపల్లిలో జరిగింది. వివరాలు.. జిల్లాకేంద్రంలోని కార్మస్ కాలనీకి చెందిన అంజలి (20) స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రైనీ నర్సుగా విధులు నిర్వహిస్తోంది. కాగా అనారోగ్యానికి గురవడంతో తానే సొంతంగా సెలైన్ బాటిల్ పెట్టుకుంది. దీంతో వాంతులు అయ్యాయి. శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బంది పడటంతో బంధువులు ఆమెను వరంగల్ MGMకు తరలిస్తుండగా మార్గమధ్య లో మృతిచెందింది. కేసు నమోదైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande